కొత్త సంవత్సరంలో కొత్త వెయ్యి రూపాయాల నోటు
కొత్త వెయ్యి రూపాయాల నోటు కొత్త సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ నెలాఖరులో ఈ నోటు విడుదల పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ :కొత్త వెయ్యి రూపాయల నోటు కొత్త సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రద్దు చేసిన నగదును స్థానంలో వెయ్యి రూపాయాల నగదును విడుదల చేస్తే కరెన్సీ కష్టాలు తగ్గే అవకాశం ఉంది.
పెద్ద నగదునోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ, తేదిన నిర్ణయం తీసుకొంది. కొత్త రెండు వేల రూపాయాల నోటు, ఐదువందల రూపాయాల నోటు మార్కెట్ లోకి వచ్చింది. అయితే రెండు వేల రూపాయాల నోటు అందుబాటులోకి వచ్చింది.మార్కెట్ లోకి వచ్చిన ఐదువందల రూపాయాల నోటు కూడ మార్కెట్ లోకి వచ్చింది.అయితే ముద్రణ లోపాల కారణంగా ఈ నోట్లను వెనక్కి తీసుకొన్నారు.
కొత్త వెయ్యి రూపాయల నోటు ను కూడ త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయాలని ఆర్ బి ఐ భావిస్తోంది. కొత్త సంవత్సరంలో కొత్త వెయ్యి రూపాయాల నోటును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్ బి ఐ ప్రయత్నిస్తోంది.
కొత్త వెయ్యి రూపాయాల నోటు విడుదల విషయాన్ని డిసెంబర్ 30వ, తేదిన ఈ విషయమై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు కొత్త 50 రూపాయాలు ఇరవై రూపాయాల నోటును కూడ అందుబాటులోకి రానున్నాయి.వెయ్యి రూపాయాల నోటు మార్కెట్ లోకి వస్తే కరెన్సీ కష్టాలు తీరే అవకాశం ఉంది.