సంక్షోభం, లాలూ సవాల్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బీహార్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పాట్నా: బీహార్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత కొంతకాలంగా ఆర్జేడీ, జేడీయు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. సిబిఐ దాడుల అనంతరం ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ చెప్పారు. కానీ ఆయన రాజీనామా చేయలేదు. అప్పటి నుంచి వివాదం మరింత ఎక్కువైంది.
తన కొడుకు మంత్రివర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోను తప్పుకోరని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెబుతున్నారు. తాజాగా, ఆయన నితీష్కు సవాల్ కూడా విసిరారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ చెబుతున్న నేపథ్యంలో.. తన కొడుకు రాజీనామా చేయడని, దమ్ముంటే తమ పార్టీతో బంధం తెంచుకోవాలని లాలూ ప్రసాద్ సవాల్ విసిరారు. దీంతో నితీష్ ఇప్పుడు రాజీనామా చేశారు.