స్నానం చేస్తుండగా సెల్ ఫోన్తో వీడియో తీసిన లాయర్.. పట్టుకుని దేహశుద్ది
న్యూఢిల్లీ: మహిళలు స్నానం చేస్తుండగా సెల్ ఫోన్తో వీడియో చిత్రీకరిస్తున్న ఓ న్యాయవాది అరెస్టు చేసిన ఘటన ఒడిషాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిషాలోని కొరాపుట్ జిల్లా జయపురం సిటీలోని ప్రసాదరావు పేటలో గురువారం ఉదయం ఒక వివాహిత ఇంట్లో స్నానం చేస్తుండగా ఎవరో కిటికీ నుంచి ఎవరో సెల్ ఫోన్తో చిత్రీకరించం గమనించి భయంతో కేకలు వేసింది.
వెంటనే స్ధానికులు సెల్ ఫోన్తో చిత్రీకరిస్తున్న న్యాయవాది నీలేష్ చాంద్ను (30) పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత న్యాయవాది ఇంట్లో సోదాలు చేయగా... సీడీలు బయటపడ్డాయని అన్నారు.
సుమారు 50 మంది మహిళలు వేరువేరు ప్రాంతాల్లో సంచరిస్తున్న, స్నానాలు చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను నిందితుడు చిత్రీకరించనట్లు పేర్కొన్నారు. నీలేష్ చాంద్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు.