వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75 శాతం పెరిగాయి: దేశంలోనే అత్యధికం ఈ ఎమ్మెల్యేల జీతాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులకు జీతాలు పెరిగాయి. 2015-16 సంవత్సరానికి గాను ఈ మేరకు ఆ రాష్ట్ర ఉభయ సభలు ఎలాంటి చర్చ లేకుండానే జీతభత్యాల పెంపుదల బిల్లును ఆమోదించాయి. దీంతో ఎమ్మెల్యేల జీతాలు 75 శాతం పెరిగాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో పోల్చితే అత్యధిక జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలుగా కర్ణాటక శాసన సభ్యులు ఉండబోతున్నారు.

OMG! Karnataka legislators get 75% salary hike

పెరిగిన జీతాలతో ఆ రాష్ట్ర ఖజానాకు 44 కోట్ల భారం పడనుంది. సీఎంకు రూ. 30 వేల నుండి రూ. 50 వేలకు, క్యాబినెట్ మంత్రులకు రూ. 25 వేల నుండి రూ. 40 వేలకు నెలకు పెంచారు. ఇక వీరికి వ్యక్తిగత ఖర్చుల కింద నెలకు రూ 1.5కు బదులు ఇకపై రూ. 3 లక్షలు కేటాయిస్తారు. ఇక సహాయ మంత్రులకు నెలకు జీతం రూ. 16 వేల నుండి రూ. 30 వేలకు పెంచారు.

వీరి వ్యక్తిగత ఖర్చు మొత్తాన్ని రూ.80 వేల నుండి రూ. 2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎమెల్సీలకు నెలకు జీతం రూ. 25 వేలకు పెంచారు. గతంలో వీరికి రూ. 20లు నెలకు ఇచ్చేవారు. వీటితో పాటు అద్దె, ప్రయాణం, హోటల్ విడిదిలకు సైతం అలవెన్స్ పెంచారు. శాసన సభ్యుల పదవీ విరమణ అనంతరం భవిష్యత్ ఫించన్‌ను రూ. 15 వేల నుండి రూ. 40 వేలకు పెంచారు.

English summary
Karnataka Legislative Assembly on Monday passed a bill to increase salaries of all MLAs by nearly 75 per cent from fiscal 2015-16. This hike puts them in the bracket of some of the highest paid law makers in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X