వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడ్‌ మీ నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ : పది నిమిషాల్లో 2.5 లక్షల ఫోన్లు అమ్మకం

చైనా కంపెనీ షియోమీ నుంచి విడుదలైన 'రెడ్ మీ నోట్ 4' స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ లోనే ఆదరగొట్టింది. జస్ట్.. పది నిమిషాల వ్యవధిలోనే 2.5 లక్షల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: చైనా కంపెనీ షియోమీ నుంచి విడుదలైన 'రెడ్ మీ నోట్ 4' స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ లోనే ఆదరగొట్టింది. జస్ట్.. పది నిమిషాల వ్యవధిలోనే 2.5 లక్షల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి.

ఈ విషయాన్ని షియోమీ కంపెనీ భారత ప్రతినిధి మను జైన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఫస్ట్ సేల్ లో నోట్ 4 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

'మి' ఉత్పత్తులు మరిన్ని భారత మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ఇదొక మంచి ప్రోత్సాహం ఇచ్చిందన్నారు. ఇది 2017 ప్రారంభంలో కంపెనీ తొలి అడుగు అని, ఈ ఏడాది చివరికల్లా మరిన్ని మైలురాళ్ళు చేరుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

Over 2.5 lakh Xiaomi Redmi Note 4 smartphones sold out in 10 minutes in first sale

రెడ్ మీ నోట్ 4 మొత్తం మూడు వేరియంట్లలో భారత మార్కెట్ లోకి విడుదల అయింది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ కలిగిన ఫోన్ ధర రూ.9,999 కాగా... 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ కలిగిన ఫోన్ ధర రూ10,999... 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ కలిగిన ఫోన్ ధర రూ.12,999 గా ఉంది.

గ్రే, గోల్డ్, సిల్వర్ కలర్ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్లు లభ్యం కానున్నాయి. త్వరలోనే మ్యాట్ బ్లాక్ కలర్ వేరియంట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్లు ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో లభిస్తున్నాయి.

English summary
Xiaomi launched its most expected Redmi Note 4 smartphone in India last week. It went on open sale at 12PM yesterday. Today it has revealed that it sold over 2,50,000 units of Redmi Note 4 units in just 10 minutes on both Flipkart and Mi.com.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X