పెషావర్: పాక్ సైన్యం దాడుల్లో 67మంది ఉగ్రవాదుల హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతం-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పాక్ భద్రత దళాలు ఉగ్రవాదులపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 67మంది ఉగ్రవాదులు మృతి చెందిన పాకిస్థాన్ అధికారులు తెలిపారు.
ఖైబర్లోని తిరాహ్ లోయ ప్రాంతంలో పాక్ భద్రతా దళాల ఆకస్మిక దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు మరణించారు. జెట్ విమానాలతో ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నారు.
పెషావర్లోని సైనిక పాఠశాలలో కాల్పులు జరిపిన తాలిబన్లు 132 మంది విద్యార్థులతోపాటు 16మంది పాఠశాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం తాలిబన్ల స్థావరాలపై దాడులకు దిగారు. తమ దాడులను కొనసాగిస్తామని పాకిస్థాన్ తెలిపింది.
ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని బుధవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. కాగా, అంతకుముందు తమ కుటుంబాలపై పాకిస్థాన్ సైన్యం దాడులకు ప్రతీకారంగానే పెషావర్ పాఠశాలపై తాము కాల్పులకు పాల్పడ్డామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.