వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ లో పాకిస్థాన్ మహిళ అరెస్టు (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుండి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన మహిళను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పంజాబ్ లోని జలంధర్ పోలీసులు పాక్ మహిళను రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఆమె భారత్ లోకి రావడానికి గల కారణాలు ఏమిటి అని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

అరెస్టు అయిన మహిళ పేరు చాంద్ ఖాన్ (27) అని వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. చాంద్ ఖాన్ కరాచికి చెందిన మహిళ అని పోలీసులు వివరాలు సేకరించారు. తాను ఢిల్లీలో జరుగుతున్న ఒక శుభకార్యానికి హాజరు కావడానికి వచ్చానని చాంద్ ఖాన్ చెబుతున్నదని పోలీసులు అన్నారు.

సంజౌత ఎక్స్ ప్రెస్ రైలులో ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తున్నదని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే జలందర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే సంజౌత ఎక్స్ ప్రెస్ రైలు ను జలందర్ రైల్వే స్టేషన్ లో నిలపరు.

పోలీసులు జలంధర్ లో రైలు నిలిపివేశారు. తరువాత రైలులో గాలించి చాంద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అమె దగ్గర పాస్ పోర్టు లేదని పోలీసులు అన్నారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనా నాగర్ లో గత సోమవారం ఉగ్రవాదులు విరుచుకుపడిన విషయం తెలిసిందే.

ఉగ్రవాదుల దాడిలో అనేక మంది మరణించారు. ఇది జరిగిన కేవలం నాలుగు రోజుల వ్యవదిలో పాక్ మహిళ పంజాబ్ లో ప్రత్యక్షం కావడంతో స్థానికులు హడలి పోతున్నారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరించడంలో నిమగ్నం అయ్యారు.

English summary
A 27 year old Pakistani woman has been detained by the Railway Police at Jalandhar. Chand Khan was on the Samjautha Express train and when asked about her passport, she failed to produce one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X