ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్: వచ్చే వారం నుంచి పేటీఎం ఇక బ్యాంకుగా సేవలు
ఇప్పటివ వరకు ఈ వ్యాలెట్గా సేవలందించిన పేటీఎం త్వరలోనే పేమెంట్స్ బ్యాంకుగా మన ముందుకు రానుంది. మే 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఆర్బీఐ తుది
ముంబై: ఇప్పటివ వరకు ఈ వ్యాలెట్గా సేవలందించిన పేటీఎం త్వరలోనే పేమెంట్స్ బ్యాంకుగా మన ముందుకు రానుంది. మే 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఆర్బీఐ తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని బ్యాంకు పబ్లిక్ నోటీస్లో తెలియజేసింది.
ఈ బ్యాంకు లైసెన్స్ విజయ శేఖర్ శర్మ పేరుతో మంజూరైంది. దీంతో కంపెనీ తన ఈ వాలెట్ వ్యాపారాన్ని ఈ బ్యాంకుకు బదిలీ చేయనుంది. దీనికి ఇప్పటికే 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్ పీపీబీఎల్లో భాగమవుతుంది.
ఒక వేళ వినియోగదారులకు ఈ విషయం ఇష్టం లేనట్లైతే పేటీఎంకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు పేటీఎం ఈ వాలెట్లోని బ్యాలెన్స్ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. అయితే, ఈ విషయాన్ని మే 23 కంటే ముందే తెలియజేయాల్సి ఉంది.
ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది. కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు రేణు శెట్టి సీఈఓగా నియమతులు కానున్నారు.