బిజీబిజీ: చంద్రబాబుతో ఖతార్ ప్రతినిధులు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాదులో పలువురితో భేటీ అయి బిజీబిజీగా గడిపారు.
చంద్రబాబు నాయుడుతో ఖతార్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఖతార్ ప్రధాన సలహాదారు షేక్ అహ్మద్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్రోలియం రంగ పెట్టుబడుల పైన చర్చించారు.
మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును వ్యతిరేకిస్తూ శాసన సభ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మోత్కుపల్లి నర్సింహులు చేసిన దీక్షకు సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనతో టిబ్రేవాలా కంపెనీ సీఈవో మనీష్ గుప్తా భేటీ అయ్యారు. ఆయనతో పాటు గుజరాత్ అంబుజా సిమెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఎండీ కూడా కలిశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన నివాసంలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ లెవీ తదితరాల పైన మంత్రులు, అధికారులతో చర్చించారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనతో పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు భేటీ అయ్యారు. రూ.26.52 లక్షల చెక్కును ఇచ్చారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఖతార్ నుండి వచ్చిన అట్లానీ గ్రూప్ ప్రతినిధులు సచివాలయంలో భేటీ అయ్యారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శనివారం నాడు సచివాలయంలో యాక్సెంచర్ ప్రతినిధులు భేటీ అయిన దృశ్యం.
చంద్రబాబు
శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును వ్యతిరేకిస్తూ శాసన సభ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మోత్కుపల్లి నర్సింహులు చేసిన దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు.