హిందూయిజం మతం కాదు.. జీవన విధానం: ముగిసిన మోడీ టూర్(పిక్చర్స్)
వాంకోవర్: హిందూయిజం ఒక మతం కాదని జీవన విధానమని ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో అన్నారు. శుక్రవారం కెనడాలో పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి నుంచి భారత్కు తిరిగి పయనమయ్యే ముందు.. శుక్రవారం వాంకోవర్లో లక్ష్మీనారాయణ్ దేవాలయాన్ని సందర్శించారు. శాస్త్రబద్ధమైన జీవనం ద్వారా ప్రకృతి ప్రయోజనాల కోసం హిందూమతం కృషి చేసిందని చెప్పారు.
భారత సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ''హిందూ ధర్మానికి సుప్రీంకోర్టు చక్కటి నిర్వచనం ఇచ్చింది. హిందూ ధర్మం.. ఒక మతం కాదని, జీవన మార్గమని చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మార్గం చూపిస్తుందని విశ్వసిస్తున్నా' అని అన్నారు. మానవాళి ప్రయోజనం కోసం యోగా గురించి సందేశాన్ని వ్యాప్తి చేయాలని ప్రవాస భారతీయులను మోడీ కోరారు. అంతకుముందు వాంకోవర్లో గురుద్వారాకు వెళ్లారు. అక్కడి ప్రార్థనలో పాల్గొన్నారు.
ప్రధాని మోడీ
హిందూయిజం ఒక మతం కాదని జీవన విధానమని ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో అన్నారు.
ప్రధాని మోడీ
శుక్రవారం కెనడాలో పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి నుంచి భారత్కు తిరిగి పయనమయ్యే ముందు.. శుక్రవారం వాంకోవర్లో లక్ష్మీనారాయణ్ దేవాలయాన్ని సందర్శించారు.
ప్రధాని మోడీ
శాస్త్రబద్ధమైన జీవనం ద్వారా ప్రకృతి ప్రయోజనాల కోసం హిందూమతం కృషి చేసిందని చెప్పారు.
ప్రధాని మోడీ
భారత సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ''హిందూ ధర్మానికి సుప్రీంకోర్టు చక్కటి నిర్వచనం ఇచ్చింది. హిందూ ధర్మం.. ఒక మతం కాదని, జీవన మార్గమని చెప్పింది.
ప్రధాని మోడీ
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మార్గం చూపిస్తుందని విశ్వసిస్తున్నా' అని అన్నారు.
ప్రధాని మోడీ
మానవాళి ప్రయోజనం కోసం యోగా గురించి సందేశాన్ని వ్యాప్తి చేయాలని ప్రవాస భారతీయులను మోడీ కోరారు. అంతకుముందు వాంకోవర్లో గురుద్వారాకు వెళ్లారు. అక్కడి ప్రార్థనలో పాల్గొన్నారు.
ప్రధాని మోడీ
కెనడాలో స్థిరపడిన సిక్కులు వారి పనితీరుతో భారత్కు గౌరవం తెచ్చిపెట్టారన్నారు.
ప్రధాని మోడీ
గురునానక్ బోధనల గురించి ప్రధాని మాట్లాడారు. భగత్సింగ్ సహా భారత స్వాతంత్రోద్యమంలో సిక్కులు పోషించిన పాత్రను గుర్తు చేశారు. మోడీ వెంట కెనడా ప్రధాని స్టీఫెన్ హర్పర్ ఉన్నారు.
ప్రధాని మోడీ
'ఎంతో సంతృప్తితో కెనడా నుంచి తిరిగి వస్తున్నాను. ఈ పర్యటనతో రెండు దేశాల సంబంధాలు మరింత విస్తృతమవుతాయి. కెనడా ప్రజలకు ఎంతో ధన్యవాదాలు' అని మోడీ ట్వీట్ చేశారు. కెనడా పర్యటన విజయవంతమయిందన్నారు.
కెనడాలో స్థిరపడిన సిక్కులు వారి పనితీరుతో భారత్కు గౌరవం తెచ్చిపెట్టారన్నారు. గురునానక్ బోధనల గురించి ప్రధాని మాట్లాడారు. భగత్సింగ్ సహా భారత స్వాతంత్రోద్యమంలో సిక్కులు పోషించిన పాత్రను గుర్తు చేశారు. మోడీ వెంట కెనడా ప్రధాని స్టీఫెన్ హర్పర్ ఉన్నారు.
'ఎంతో సంతృప్తితో కెనడా నుంచి తిరిగి వస్తున్నాను. ఈ పర్యటనతో రెండు దేశాల సంబంధాలు మరింత విస్తృతమవుతాయి. కెనడా ప్రజలకు ఎంతో ధన్యవాదాలు' అని మోడీ ట్వీట్ చేశారు. కెనడా పర్యటన విజయవంతమయిందన్నారు. కెనడా సందర్శన చరిత్రాత్మకం అన్నారు. 'ఎంత సమయం వెచ్చించామన్నది పర్యటన ప్రాముఖ్యానికి కొలమానం కాదు. లక్ష్యాలతోనే అంచనా వేయాలి' అని కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఇచ్చిన విందు కార్యక్రమంలో మోడీ అన్నారు.
ఢిల్లీ చేరుకున్న పిఎం మోడీ
పశ్చిమాసియా దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెల్లవారుజామున దిల్లీ చేరుకున్నారు. మోడీ 9రోజుల పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలో పర్యటించిన విషయం తెలిసిందే. బిజెపి ఢిల్లీ ఛీప్ సతీష్ ఉపాధ్యాయ, సీనియర్నేతలు, ఎమ్మెల్యేలు పాలెం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికారు.