భార్యను కొట్టిన ఆ ఎమ్మెల్యే బెయిల్ రద్దు చేయాలి
ఆప్ ఎమ్మెల్యే , ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి తన భార్యను వేధిస్తూ కొట్టేవాడని పోలీసులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు
న్యూఢిల్లీ:ఆప్ ఎమ్మెల్యే , ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి తన భార్యను వేధిస్తూ కొట్టేవాడని పోలీసులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు.
గృహహింస కేసులో ఆయనకు బెయిల్ రద్దు చేయాలంటూ ఆయప భార్య లిపికా మిత్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఐఎస్ మోహతాకు పోలీసులు చెప్పారు.
ఎమ్మెల్యే అయితన తన భర్తకు బెయిల్ ఇచ్చేముందు దిగువ కోర్టు తగిన విధంగా వ్యవహారించలేదని లిపికామిత్రా కోర్టును ఆశ్రయించారు.ఎమ్మెల్యే అయిన తన భర్తకు బెయిల్ ఇచ్చే ముందు దిగువ కోర్టు తగిన విధంగా వ్యవహరించలేదని లిపికా మిత్రా కోర్టుకు విన్నవించారు.
కోర్టు సూచనల మేరకు పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. లిపికా మిత్రా శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కుక్క కాట్లు, కాలిన గాయాల వల్లేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను కూడ కోర్టుకు సమర్పించారు.
పెళ్లైన కొద్దిరోజుల నుండే సోమ్ నాథ్ భారతి తనను కొట్టేవాడని భార్య ఆరోపించింది.తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పినా కూడ ఆయన తనపై దాడి చేశాడని ఆమె చెప్పారు.
గర్భవతిగా ఉన్న సమయంలో కూడ దాడులను ఆపలేదన్నారామె. మధుమేహం, హైపర్ టెన్షన్ తో భాదపడుతున్నట్టు వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. అయితే తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలను సోమ్ నాథ్ భారతి ఖండించారు.