వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్భిణిని రైల్లోంచి తోసేసిన భర్త: పట్టాలపైనే ప్రసవం, శిశువు మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాయగడ: గర్భిణి అని కూడా చూడకుండా తన భార్యను రైల్లోంచి తోసేశాడు ఓ దుర్మార్గపు భర్త. ఈ సంఘటన ఒడిశాలోని రాయ్‌గడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భర్త రైలు నుంచి తోసేయడంతో రైలు పట్టాలపైనే ప్రసవించింది.

ఈ సంఘటనకు సంబంధించి రాయగడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సరోజిని అనే గర్భిణి తన భర్తతో కలిసి సొంత పట్టణం రూర్కెలా వెళ్లేందుకు గాను జగదల్ పూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు కోరాపుత్ - రాయగడ మధ్య ప్రాంతంలోకి రాగానే తన భర్త సురజ్ కెర్కెతా వేరే ఫోన్‌లో మహిళతో మాట్లాడుతుండగా అడ్డు చెప్పింది.

Pregnant Odisha woman thrown off moving train; police launch manhunt

దీంతో తనపై ఆగ్రహించిన భర్త తెల్లవారుజామున 4 గంటల సమయంలో రౌలి స్టేషన్ రాగానే నిద్రపోతున్న తనను లేపి రైల్లోంచి తోసేసినట్లు బాధితురాలు పోలీసుల విచారణలో వెల్లడించింది. బాధితురాలు రైలు పట్టాలపైనే ప్రసవం కావడంతో శిశువు అక్కడికక్కడే మరణించింది.

సమాచారం అందుకున్న రాయగడ రైల్వే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని బాధిత మహిళను సమీపంలోని రైల్వే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి చికిత్సనందించిన వైద్యులు ప్రస్తుతం మహిళ పరిస్ధితి స్ధిరంగా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి భర్త, నిందితుడి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
A day after a pregnant woman was thrown off a moving train, Odisha police today launched a manhunt to nab the accused husband who has been absconding since the hair-raising incident that led to delivery of stillborn child on the tracks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X