పన్నీర్, పళని దెబ్బ: బెంగళూరు రిసార్ట్ కు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్లాన్ !
తమిళనాడు ప్రభుత్వంతో ఆడుకుంటున్న టీటీవీ దినకరన్ ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్నాడు. తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోని ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాలో .
పుదుచ్చేరి/బెంగళూరు: తమిళనాడు ప్రభుత్వంతో ఆడుకుంటున్న టీటీవీ దినకరన్ ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్నాడు. తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోని ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాలో పెట్టి తమిళనాడు ప్రభుత్వానికి సవాలు విసిరాడు.
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ విద్యాసాగర్ రావ్ భేటీ: ఏం చేస్తారో !
రిసార్ట్ లో ఉండవలసిన ఎమ్మెల్యేలు బుధ, గురువారం రోజుల్లో పుదుచ్చేరి బీచ్ కు వెళ్లి వాకింగ్ చేస్తూ బీచ్ లో స్నానం చేస్తూ జల్సాలు చేస్తున్నారు. బీచ్ కు వెలుతున్న ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం ఉందని టీటీవీ దినకరన్ వర్గం నాయకులు పసిగట్టారు.
ఐదు మంది ఎమ్మెల్యేలను తమ దారికి తెచ్చుకోవడానికి సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చెయ్యడంతో మాన్నార్ గుడి మాఫియా అలర్ట్ అయ్యింది. ఇదే సమయంలో పుదుచ్చేరి సమీపంలోని రిసార్ట్ దగ్గర ఆందోళనలు మొదలు కావడంతో దినకరన్ వర్గం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
రిసార్ట్ లో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు: చెప్పులతో కొట్టిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రక్షణ !
పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలు ఉంటే గొడదూకే అవకాశం ఉందని అనుమానంతో వారిని గురువారం రాత్రి బెంగళూరు తరలించడానికి రంగం సిద్దం అయ్యింది. బెంగళూరు శివర్లలోని రిసార్ట్ లో ఎమ్మెల్యేలను పెట్టాలని దినకరన్ వర్గం నిర్ణయించింది. గతంలో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరు నగర శివార్లలోని రిసార్ట్ లో పెట్టి సక్సస్ కావడంతో ఆ సెంటిమెంట్ ను దినకరన్ ఫాలో అవుతున్నారని తెలిసింది.