నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-27
శ్రీహరికోట: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-27వాహననౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లనుంది. ఈ వాహననౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఇందులో ఇంధనం 821.5కిలోలు కాగా ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. దీని తయారీకి రూ. 125 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రయోగం సఫలమైతే దేశానికి సొంతంగానేవిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 1500 కిలోమీటర్ల పరిధిలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
నావిగేషన్ అభివృద్ధికి గాను మొత్తం ఏడు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను నింగిలోకి పంపాల్సి ఉండగా, ఇప్పుడు పంపిస్తున్నది నాల్గవది. ఇస్రో ఛైర్మన్గా కిరణ్ కుమార్కు ఇది తొలి ప్రయోగం. సరిగ్గా 5 గంటల 19 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది.