వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థిని కిడ్నాప్: ఆరు మంది గ్యాంగ్ రేప్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమోగ్గ: బెంగళూరుకు చెందిన ద్వితీయ పీయుసీ (ఇంటర్) విద్యార్థిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలోని శివమోగ్గ పట్టణం సమీపంలో జరిగింది. పోలీసులు ఇప్పటికే నలుగురు కామాంధులను అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులో నివాసం ఉంటున్న విద్యార్థిని శివమోగ్గలోని సహ్యాద్రి కాలేజ్ లో జరుగుతున్న వేడుకలో పాల్గొన్నడానికి రైలులో అక్కడికి వెళ్లింది. తరువాత ఆటోలో సహ్యాద్రి కాలేజ్ దగ్గరకు బయలుదేరింది.

ఆటో డ్రైవర్ షారుఖ్ కొద్దిదూరం వెళ్లిన తరువాత దారి మళ్లించాడు. ఆటోలో అతని స్నేహితులు ఇద్దరు ఎక్కారు. ఆ సమయంలో యువతి అభ్యంతరం చెప్పడంతో దారిలో వీరు దిగేస్తారని ఆటో డ్రైవర్ షారుఖ్ చెప్పాడు.

 PUC Student kidnapped, gangraped in Karnataka

కొద్దిదూరం వెళ్లిన తరువాత నిందితులు మరో నలుగురితో కలిసి యువతిని నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి బెదిరించి ఆమె నోట్లు బట్టలు కుక్కి, చేతులు కట్టి సామూహిక అత్యాచారం చేసి పరారైనారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో శివమోగ్గలోని సురభి మహిళా సాంత్వన కేంద్రంలో కేసు నమోదు అయ్యింది.

ఈ కేసును తానే స్వయంగా దర్యాప్తు చేస్తున్నామని శివమోగ్గ జిల్లా ఎస్పీ అభినవ్ ఖరె చెప్పారు. ఇప్పటికే నలుగురు కామాంధులను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ అభినవ్ ఖరె తెలిపారు. యువతికి వైద్య పరిక్షలు చేయించారు.

English summary
The 17-year-old PUC student from Bengaluru was dragged into an autorickshaw by six persons on road near Shimoga in Karnataka. PUC student gangraped in Shimoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X