అసెంబ్లీలో పడిపోయిన ఎమ్మెల్యేలు, మార్షల్స్ తీసుకెళ్లడంతో గాయాలు
పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు లాక్కు వచ్చారు.ఈ సమయంలో పలువురు ఎమ్మెల్యేలకు స్వల్పంగా గాయాలయ్యాయి.
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు లాక్కు వచ్చారు. ఈ సమయంలో పలువురు ఎమ్మెల్యేలకు స్వల్పంగా గాయాలయ్యాయి.
అసెంబ్లీలో గురువారం గందరగోళం ఏర్పడింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు లోక్ ఇన్సాఫ్ పార్టీల ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటికి పంపేశారు.
ఏఏపీ ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైరా, ఎల్ఐపీ నేత సిమర్ జీత్ సింగ్ను అసెంబ్లీలోనికి రానివ్వకపోవడంతో గురువారం ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని పోడియం పైకి చేరి నిరసన వ్యక్తం చేశారు.
ఈ గందరగోళంలో నలుగురు ఏఏపీ నేతలు కళ్లు తిరిగి పడిపోయారు. దాంతో స్పీకర్ రానా కేపీ సింగ్ వారందరినీ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. దీంతో కొందరికి స్వల్పంగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సుఖ్పాల్, సిమర్జీత్లు అసెంబ్లీ బయట ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్
ప్రభుత్వం
అవినీతి
ప్రభుత్వం
అంటూ
నినాదాలు
చేశారు.
జూన్
16న
సుఖ్పాల్
ఖైరా
అసెంబ్లీలో
జరిగిన
గొడవని
ఫేస్బుక్
లైవ్లో
వీడియో
తీసినందుకు,
సిమర్జీత్
జూన్
15న
స్పీకర్పై
పేపర్లు
విసిరినందుకు
వారిద్దరినీ
అసెంబ్లీ
నుంచి
సస్పెండ్
చేశారు.