వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీకి స్మారకం: మోడీకి కితాబు, సోనియాపై ఫ్యామిలీ అప్‌సెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పీవీ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తున్నారు.

ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన, మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపిన ఘనత పీవీ సొంతం. ఇలాంటి పీవీని కాంగ్రెస్ పార్టీ విస్మరించారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పీవీకి ఢిల్లీలో స్మారక స్థూపం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

దీనిపై పీవీ తనయులు పీవీ రాజేశ్వర రావు, పీవీ ప్రభాకర రావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీవీ అభిమానులు కూడా మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం యమునా నది ఒడ్డున పీవీ మెమోరియల్ నిర్మించనుంది.

PV Narsimha Rao family unhappy with Sonia Gandhi

ప్రధాని మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పీవీ స్మారక స్థూపం విషయమై పలుమార్లు డిమాండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం దానిని నెరవేర్చడం సంతోషమని చెబుతున్నారు.

పీవీ నర్సింహా రావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో హామీ ఇచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ దానిని నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఈ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ విషయం విస్మరించారని మండిపడుతున్నారు.

English summary
PV Narsimha Rao family unhappy with Sonia Gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X