రాహుల్ను ఫోటో తీసిన అభిమాని, ప్రతి నెల వస్తానని మోడీ (పిక్చర్స్)
శ్రీనగర్/రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు వేర్వేరు చోట్ల శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మోడీ, జార్ఖండ్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం జార్ఖండ్ రాష్ట్రంలో విమానాశ్రయంలో దిగిన రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం ప్రచార సభలో పాల్గొంటారు.
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి నెల జమ్ము కాశ్మీర్ వచ్చి ప్రజల సమస్యలు తీరుస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు జమ్ము కాశ్మీర్ను దోచుకున్నాయని, అవినీతి రహిత పాలన కవాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.
ఉధంపూర్లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రధానిపైనా చూపనంత అభిమానం కాశ్మీర్ ప్రజలు తనపై చూపుతున్నారని, ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలన్నారు. జమ్ము కాశ్మీర్లో 30 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని, అధికార, విపక్షనేతలు అవినీతిలో మునిగిపోయారన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే, రాష్ట్రంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. దేశంలోని యువత ఉపాధి కోరుకుంటోందని, యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు.
నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పర్యాటక రంగంవల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. జన్ధన్ యోజన పథకంతో పేదలకు బ్యాంక్ ఖాతాలు కల్పించామని చెప్పారు. ఈ పథకంతో ఖాతాదారులకు బీమా సదుపాయం కూడా కల్పించామన్నారు.
నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. దేశంలోని యువత ఉపాధి కోరుకుంటోందని, యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు.
రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు వేర్వేరు రాష్ట్రాల్లో శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం జార్ఖండ్ వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలతో కరచాలనం చేస్తున్నదృశ్యం.
రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం జార్ఖండ్ వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలతో మమేకమవుతున్న సమయంలో.. ఓ అభిమాని ఫోటో క్లిక్ మనిపిస్తున్న దృశ్యం.
రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం జార్ఖండ్ వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ..
రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం జార్ఖండ్ వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీ చైబసా సభలో మాట్లాడుతున్న దృశ్యం.