ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు విమానంలో ప్రయాణించొచ్చు, రూల్స్ లేవన్న కేంద్రం
ఎయిరిండియా అధికారిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తపడినట్టు కన్పిస్తోంది. అన్ని విమానాల్లో రవీంద్ర గైక్వాడ్ ప్రయాణించేందుకుగాను కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిరిండియా అధికారిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తపడినట్టు కన్పిస్తోంది. అన్ని విమానాల్లో రవీంద్ర గైక్వాడ్ ప్రయాణించేందుకుగాను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంలో గొడవపడిన గైక్వాడ్ , సుకుమార్ అనే ఎయిరిండియా ఉద్యోగిపై గురువారం నాడు చెప్పుతో కొట్టారు.దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది.
ఈ ఘటనలో ఎంపిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిరిండియా సహా ప్రధాన విమాన సంస్థల్లో గైక్వాడ్ ప్రయాణించకుండా నిషేధం విధించారు. ఢిల్లీ నుండి పూణెకు తిరిగి వెళ్ళేందుకుగాను గైక్వాడ్ రిజర్వ్ చేసుకొన్న టిక్కెట్టును కూడ రద్దు చేశాయి.
దీంతో ఆయన రైలులో ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు శివసేన ఎంపీలు కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజు, స్పీకర్ సుమిత్రా మహాజన్ లను కలిసి గైక్వాడ్ పై నిషేధం తొలగించాలని కోరారు.
విమానాల్లో ప్రయాణించకుండా ఆపేలా చట్టం లేదని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీవీ చౌదరి చెప్పారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే విమానాల్లో ప్రయాణించేందుకు గైక్వాడ్కు అనుమతిచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.