వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్ జియో నుంచి.. మరో బంపర్ ఆఫర్!

రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మొబైల్‌ పోస్ట్‌ పెయిడ్‌, ప్రీపెయిడ్‌ రీచార్జిలపై ఉత్తేజకరమైన ఆఫర్లను లాంచ్‌ చేసింది. పేటీఎం, ఫోన్‌ పే ద్వారా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మొబైల్‌ పోస్ట్‌ పెయిడ్‌, ప్రీపెయిడ్‌ రీచార్జిలపై ఉత్తేజకరమైన ఆఫర్లను లాంచ్‌ చేసింది. పేటీఎం, ఫోన్‌ పే ద్వారా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

ముఖేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ జియో పేటీఎం, ఫోన్‌ పే యాప్‌ల ద్వారా రీచార్జిలపై తాజాగా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది. పేటీఎం ద్వారా అయితే రూ.300 ఆఫర్‌పై రూ.76ల క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది.

Reliance Jio recharge: Amazon, Paytm, Flipkart offer cashback of up to Rs 99

ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.75 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది. అయితే దీనికి జియో యూజర్లకు కంపెనీ పంపిన ఒక ప్రోమో కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

పేటీఎం యాప్‌లో 'మొబైల్ ప్రీపెయిడ్' లేదా 'మొబైల్ పోస్ట్‌ పెయిడ్' అప్షన్స్‌ను ఎంచుకుని జియో ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి 'ప్రోగ్రెస్ టు రీఛార్జ్'పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ప్రోమో కోడ్‌నుకూడా జతచేయాలి. దీంతో రీచార్జ్‌ పూర్తవుతుంది.

అయితే ఈ ప్రోమో కోడ్‌ ఎంట్రీ పై కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే జియో వినియోగదారుల ప్రోమో కోడ్ జాబితాలో ఉందనీ, అందుకనీ పేటీఎం ద్వారా రీచార్జ్‌ సందర్భంగా ఈ ప్రోమో కోడ్ ఎంటర్ అవసరం లేదని తెలుస్తోంది.

రీఛార్జ్ పూర్తి అయిన 24 గంటల్లో ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ రూ. 76 కస్టమర్ల ఖాతాలో చేరుతుంది. ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలను జియో అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మరోవైపు మరికొన్ని రోజుల్లోనే ఉచిత ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల చేతుల్లోకి రానుంది. దీంతో దేశీయ సర్వీసు ప్రొవైడర్లు ఆందోళనలో పడిపోయారు. రిలయన్స్‌ జియో ఉచిత ఫీచర్ల ఫోన్ల వల్ల టెలికం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీయ రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఫిర్యాదు కూడా చేసింది.

జియో ఫోన్ల వల్ల ఆపరేటర్ల ఆదాయాలు మరింత తగ్గే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా ఆఫర్‌తో ప్రధాన టెలికాం సంస్థలకు గుండెల్లో గుబులే. జియో టారిఫ్‌ ప్లాన్స్‌ రూ.19 నుంచి రూ.309మధ్య ఉన్న సంగతి తెలిసిందే.

English summary
Reliance Jio is now offering cashback to consumers on recharges. You can get one by using Amazon, Paytm and Flipkart’s Phonepe. Reliance Jio is currently offering 8 plans above Rs 300. The recharges are as follow: Rs 309, Rs 349, Rs 399, Rs 509, Rs 999, Rs 1,999, Rs 4,999 and Rs 9,999. Jio's cashback offer is valid for a recharge above Rs 300 and is a one-time arrangement. Here is how it stacks up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X