వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టపగలే ఎమ్మెల్యే హత్య: మాజీ ఎంపీకి జీవిత ఖైదు

ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హజారీబాగ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1995నాటి ఎమ్మెల్యే అశోక్ సింగ్ హత్య కేసులో ఇటీవల ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు..

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హజారీబాగ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1995నాటి ఎమ్మెల్యే అశోక్ సింగ్ హత్య కేసులో ఇటీవల ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు.. మంగళవారం తుది తీర్పు వెలవరించింది.

ఈ కేసును విచారించిన జిల్లా అదనపు న్యాయమూర్తి సురేంద్ర శర్మ... ప్రభునాథ్ సింగ్‌తో పాటు ఆయన సోదరుడు దీననాథ్ సింగ్, మాజీ సర్పంచ్ రితేశ్ సింగ్‌లకు కూడా జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

RJD's Prabhunath Singh sentenced to life imprisonment in Ashok Singh murder case

1995లో అప్పటి మార్సఖ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ సింగ్ హత్య జరిగింది. పట్టపగలు ఆయన నివాసంవద్దే దుండగులు అశోక్‌సింగ్‌ను కాల్చిచంపారు. 1997లో పాట్నా హైకోర్టు ఈ కేసును పాట్నా నుంచి హజారీబాగ్‌కు బదిలీ చేసింది. నిందితుడు ప్రభునాథ్ సింగ్.. ఎంపీగా, ఎమ్మెల్యేగా మహారాజ్‌గంజ్, మార్సాఖ్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. అంతేగాక, ఆర్జేడీ అధినేత లూలూకు అత్యంత సన్నిహితుడు కూడా.

కాగా, దిగువకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ప్రభునాథ్ సోదరుడు పేర్కొన్నారు. ప్రస్తుతం హజారీబాగ్ కేంద్ర కర్మాగారంలో కస్టడీలో ఉన్న ప్రభునాథ్ సహా ఇతరులను వారం రోజుల క్రితమే కోర్టు నిందితులుగా తేల్చింది.

English summary
A Hazaribagh court on Tuesday sentenced senior RJD leader and former MP Prabhunath Singh to life imprisonment for the murder of MLA Ashok Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X