వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు: మే 8న హాజరుకావాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివాండీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు జారీ చేసింది.

కాగా, వ్యక్తిగత కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మే 8న కోర్టు హాజరుకావాలని ఆదేశించింది. నిరుడు లోకసభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. గాంధీని ఆర్‌ఎస్‌ఎస్ పొట్టన బెట్టుకుందని లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 RSS killed Gandhi remark: Rahul Gandhi to appear before court on May 8

ఏప్రిల్ 19కి ముందే రాహుల్‌గాంధీ రాక?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన సెలవులను ముగించుకుని ఏప్రిల్ 19 వ తేదీకి ముందు ఎప్పుడైనా తిరిగి రానున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో రాహుల్ సెలవుపై వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ కేసు విషయంలో ఆయన సోమవారం మహారాష్ట్ర కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ సెలవులో ఉన్న కారణంగా రాహుల్ కోర్టుకు హాజరుకాలేదు.

English summary
A Bhiwandi court in Maharashtra summoned Congress vice president Rahul Gandhi to appear before it on May 8 for his remarks against the Rashtriya Swayamsevak Sangh (RSS) and blaming the outfit for assassination of Mahatma Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X