ఆడేసుకుంటున్నారు, ఎవరీ దయ అవసరం లేదు: బయటికొచ్చిన మాల్యా
భారత్లో ప్రధాన పార్టీలు తనను ఫుట్బాల్లా ఆడుకుంటున్నాయని బ్యాంక్లకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన లిక్కర్ టైకూన్ విజయ్మాల్యా అన్నారు.
లండన్:
భారత్లో
ప్రధాన
పార్టీలు
తనను
ఫుట్బాల్లా
ఆడుకుంటున్నాయని
మనదేశంలోని
బ్యాంక్లకు
రూ.9,000
కోట్లు
ఎగ్గొట్టిన
కేసులో
నిందితుడైన
లిక్కర్
టైకూన్
విజయ్మాల్యా
అన్నారు.
ఈ
విషయం
ఇటీవల
ఎన్నికల్లో
పార్టీ
నేతల
ప్రసంగాల్లో
తేటతెల్లమైందని
తెలిపారు.
వారు ఆధారాలతో రానివ్వండి.. అసలు వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటే చట్టం ఎప్పుడో తనపని తాను చేసుకుపోయేదని అన్నారు. యూకే చట్టాల కింద సురక్షితంగా ఉన్నానన్నారు.
భారతప్రభుత్వంలో ఎవరో దయతో బతికే కంటే ఇది సురక్షితమని మాల్యా తెలిపారు. కాగా, భారత అధికారులు.. యూకే అధికారులతో మాల్యా అప్పగింతపై చర్చలు జరిపిన రెండు రోజుల తర్వాత ఆయన ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
బయటి ఈవెంట్లో విజయ్ మాల్యా
విజయ్ మాల్యా ఫార్ములా వన్ కారు రేసింగ్ బృందం సహారా ఫోర్స్ కొత్త కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిల్వర్స్టోన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన డ్రైవర్లు పెరీజ్, ఈస్ట్బన్తో కలిసి ఫొటోలు దిగారు. వీటిన ఫార్ములా వన్.కామ్లో అప్లోడ్ చేశారు. మన దేశం నుంచి పారిపోయిన తర్వాత లండన్లోనే అజ్ఞాతంలో ఉంటున్న విజయ్ మాల్యా.. తొలిసారి ఇలా బయట జరిగిన కార్యక్రమంలో దర్శనమివ్వడం గమనార్హం.