సరితా నాయర్ ఆంటీ ఎక్కడ, స్కాం ఏమైంది (ఫోటోలు)
కొచ్చి: కేరళ సోలార్ స్కామ్ కేసుతో యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన సరితా నాయర్ అలియాస్ సరిత (37) ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలియడం లేదు. సోలార్ స్కాం కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.
అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో సహ ఇద్దరు మంత్రులకు తాను లంచం ఇచ్చానని సరితా నాయర్ సంచల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తనను శారీరకంగా ఉపయోగించుకున్నారని ఆమె బాంబు పేల్చింది.
కేరళలో మెగా సోలార్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అనుమతులు ఇవ్వాలని తాను ఊమెన్ చాందీ కీలక అనుచరుడికి రూ. 1.9 కోట్లు లంచం ఇచ్చానని ఆరోపిస్తూ కేసు విచారణ చేస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు సరితా నాయర్ వాగ్మూలమిచ్చింది.
శారీరకంగా వాడుకున్నారు
మోగా సోలార్ ప్రాజెక్టులకు అనుమతి ఇస్తామని నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నారని సరితా నాయర్ సంచల వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది
అప్పటి కేరళ యూడీఎఫ్ ప్రభుత్వాన్ని సరితా నాయర్ ముప్పుతిప్పలు పెట్టారు. ఉమెన్ చాందీతో పాటు అప్పటి ఇద్దరు మంత్రులకు నిద్రపట్టనివ్వకుండా చేశారు.
ఎంత వరకైనా సిద్దమే
తనను హింసించిన వారిని వదిలిపెట్టనని సరితా నాయర్ ఇప్పటికే చెప్పారు. ఈ కేసు విషయంలో పోరాడటానికి ఎంత వరకైనా తాను సిద్దంగా ఉన్నానని ఆమె అన్నారు.
అప్పులు చేసి డబ్బులు ఇచ్చాను
తాను అప్పులు చేసి మీకు డబ్బులు ఇస్తున్నాని, వెంటనే మెగా సోలార్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి సహాయం చెయ్యాలని ఊమెన్ చాందీ, ఇద్దరు మంత్రులను వేడుకున్నానని సరితా నాయర్ జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు చెప్పింది.
ప్రతిపక్షాల ఆందోళనలు
ఊమెన్ చాందీ, లంచం తీసుకున్న మంత్రులు వెంటనే రాజీనామా చెయ్యాలని అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.
ప్రతిపక్షాల చేతికి అస్త్రం
గత కేరళ శాసన సభ ఎన్నికల సందర్బంగా యూడీఎఫ్ ప్రభుత్వం మీద వామపక్ష పార్టీల నాయకులు సోలార్ స్కాం విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
చివరి ఇంటికి
సోలార్ స్కాంలో చిక్కుకున్న యూడీఎఫ్ ప్రభుత్వాన్ని కేరళ ప్రజలు ఇంటికి పంపించారు.
అధికారంలోకి వచ్చిన తరువాత
కేరళలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి ప్రభుత్వం సోలార్ స్కాం కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నది.
వదిలి పెట్టం
సోలార్ స్కాం కేసులో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలి పెట్టరాదని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. పలు కోణాలలో ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.