నేడు కోర్టులో లొంగిపోనున్న శశికళ!: లీగల్ అడ్వైజర్ల సూచన ఇదే, జయ బ్యారక్కే శశి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో బుధవారం బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు ఆమె సిద్ధమైనట్లు సమాచారం.
బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో బుధవారం బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు ఆమె సిద్ధమైనట్లు సమాచారం. సహ నిందితులు ఇళవరసి, సుధాకరణ్ లతోపాటు శశికళను లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శశికళ తన లీగల్ అడ్వైజర్ల సూచన మేరకు కోర్టు ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోర్టులో లొంగిపోయిన తర్వాతే రివ్యూ పిటిషన్ వెళ్దామని ఆమెతో వారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోర్టు ఎదుట లొంగిపోవాలని శశికళ నిర్ణయించుకున్నారు.
కుట్రస్థానం పోయెస్ గార్డెన్, జయే మాస్టర్ మైండ్: సుప్రీం కీలక వ్యాఖ్యలివే
లొంగిపోయిన వెంటనే.. శశికళను పరపనగ్రహారలోని కేంద్ర కారాగారినికి తరలించనున్నారు పోలీసులు. గతంలో జయలలిత, బీఎస్ యడ్యూరప్ప ఉన్న బ్యారక్లోనే శశికళను కూడా ఉంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో బెంగూళరు, కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.