వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ!: జయ అడుగుజాడల్లో..

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న చర్చకు తెరపడింది. జయలలిత నెచ్చెలి శశికళకే పార్టీ బాధ్యతలను అప్పగించాలని అన్నాడీఎంకే నిర్ణయించింది.

పార్టీ బాధ్యతలన్నీ అప్పగిస్తూ అన్నాడీఎంకే ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. పోయెస్ గార్డెన్‌లో శశికళను కలిసిన అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరారు. జయ అడుగుజాడల్లో పార్టీని ముందుకు నడపాలని ఆమెను అభ్యర్థించారు.

ఈ క్రమంలో శశికళనే పార్టీ బాధ్యతలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంపాటు జయలలిత కొనసాగిన ప్రధాన కార్యదర్శి పదవిలో ఇక శశికళ కొనసాగనున్నారు. ఎంజీఆర్ తర్వాత 30ఏళ్లపాటు జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు.

అయితే, ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే శశికళకు అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అప్పగించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, శశికళ మధ్య బేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో పార్టీ మనుగడ ఎలా ఉంటుందోనని పలువురు నేతలు మదనపడుతున్నట్లు సమాచారం.

English summary
Sasikala as AIADMK's general secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X