శుభవార్త:సేవింగ్స్ ఖాతాల నుండి రూ.50వేలు విత్ డ్రాయల్ కు రంగం సిద్దం
సేవింగ్స్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకుగాను ఆర్ బి ఐ చర్యలను తీసుకొంటుంది.
న్యూఢిల్లీ:సేవింగ్స్ ఖాతా వినియోగదారులకు శుభవార్త. నగదు ఖాతాల నుండి నగదు విత్ డ్రాయల్ పై ఉన్న పరిమితిని ఎత్తివేసే అవకాశం ఉంది. ఈ మేరకు సోమవారం నుండే సుమారు 50 వేల వరకు నగదును సేవింగ్స్ ఖాతాల నుండి డ్రా చేసుకొనే వెసులుబాటును కల్పించనుంది.
పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత నుండి నగదు ఉపసంహరణపై ఆర్ బిఐ ఆంక్షలను విధించింది. అయితే దశలవారీగా ఈ ఆంక్షలను ఆర్ బి ఐ ఎత్తివేసింది.
ఇటీవలనే కరెంట్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొంది. దరిమిలా సేవింగ్స్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితిని ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సేవింగ్స్ ఖాతాల నుండి సోమవారం నుండి రూ.50 వేల రూపాయాలను విత్ డ్రాయల్ చేసుకొనేలా ఆర్ బి ఐ వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.ఈ మేరకు జనవరి 30వ, తేదిన ఆర్ బి ఐ నోటిపికేషన్ ను విడుదల చేసింది.
వచ్చే నెల 13వ, తేది నుండి నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకుగాను ఆర్ బి ఐ చర్యలు తీసుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కొత్ కరెన్సీ కోసం ప్రజల నుండి పెద్దగా డిమాండ్ లేదు. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా కరెన్సీ ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇబ్బందులు లేవని భావించిన నేపథ్యంలో ఆర్ బి ఐ సేవింగ్స్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయనుంది.