వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామమందిర నిర్మాణ వివాదాన్ని త్వరగా తేల్చలేం: సుప్రీంకోర్టు
అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాన్ని త్వరగా తేల్చేసే విషయమై సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయమై బీజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను దాఖలు చేశాడు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాన్ని త్వరగా తేల్చేసే విషయమై సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయమై బీజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును సుబ్రమణ్యస్వామి కోరాడు.అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించే విషయమై నిరాకరించింది సుప్రీంకోర్టు.
ఈ కేసులో సుబ్రమణ్యస్వామి ఒక పార్టీ అనే విషయం తమకు తెలియదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అసలు ఈ కేసు దాఖలు చేయడానికి మీకున్న అర్హత ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇప్పటికిప్పుడే ఈ కేసును విచారించేందుకుగాను తమకు సమయం లేదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రామమందిరం వివాదం గురించి తన వాదనలను విన్పించేందుకు స్వామికి అవకాశం ప్రస్తుతానికి లేదు.
Comments
English summary
The Supreme Court on Friday refused to hear the Ram Janmabhoomi matter early. The submission was made by senior BJP leader and Rajya Sabha MP, Subramanian Swamy.