కేజ్రీవాల్కు మరో షాక్: ఐదో ఎమ్మెల్యే... త్రిపాఠి అరెస్ట్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఇది మరో షాక్. గురువారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అల్లర్ల కేసు విషయంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ ఎమ్మెల్యే పేరు అఖిలేష్ త్రిపాఠి. అతను ఢిల్లీలోని మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అవినీతి లేని రాజకీయం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేతలు జైలు పాలవుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఆయిదుగురు అరెస్టయ్యారు. ప్రస్తుతం అరెస్టైన అఖిలేష్ త్రిపాఠి 2013లో ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో ఉన్నాడని తెలుస్తోంది. అతనిని పోలీసులు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈయనపై ఇప్పటి వరకు 21 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.