ఫేస్ బుక్ లో అభ్యంతరకర కామెంట్స్, కేసులు
ఉత్తరప్రదేశ్: ఫేస్ బుక్ లో అభ్యంతరకర వాఖ్యలు చేస్తు పోస్ట్ చెయ్యడం వలన 7 మంది యువకుల మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు వివిద సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
విపుల్ సింగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అతని ఫేస్ బుక్ లో ఒక మతాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఎస్ పీ నాయకుడు తమ మతాన్ని కించపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు.
తరువాత ఆ నాయకుడి నేతృత్వంలో కోత్వాలి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్నఅసిస్టెంట్ పోలీసు కమిషనర్ దినేష్ త్రిపాఠి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో చర్చించి విషయం తెలుసుకున్నారు.
వెంటనే విపుల్ సింగ్ మీద కేసు నమోదు చెయ్యాలని దినేష్ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన విపుల్ సింగ్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ దినేష్ తెలిపారు. విపుల్ సింగ్ ఫేస్ బుక్ వ్యాఖ్యలను లైక్ చేసిన మరొ ఆరు మంది మీద కేసులు నమోదు అయ్యాయి.