'కనీస శాలరీ రూ.18,000 నుంచి 26,000కి పెంచాలి'
న్యూఢిల్లీ: ఆర్మీ ఉద్యోగుల తర్వాత రైల్వే స్టాఫ్ సేవంత్ పే కమిషన్ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సమాచారం మేరకు... రైల్వే యూనియన్ ఈ కమిషన్ పైన తీవ్ర అసంతృప్తితో ఉంది. అంతేకాదు, అవసరమైతో నిరవధిక దీక్షకు సిద్ధమని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుత సేవంత్ పే కమిషన్లో తమకు లాభదాయకంగా ఏమీ లేవని, తమ కొన్ని సిఫార్సులను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బుధవారం నాడు నార్తర్న్ రైల్వే మెన్ యూనియన్ (ఎన్ఆర్ఎంయు) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినట్లుగా తెలుస్తోంది. నిరనస గురించి ప్రశ్నిస్తే... సేవంత్ పే కమిషన్ పైన తాము సంతృప్తికరంగా లేమని చెప్పారు.
ఏడో వేతన సవరణలో కొన్ని రెక్టిఫై కావాల్సి ఉన్నాయని చెబుతున్నారు. కొత్త పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పున ప్రారంభం కావాలని డిమాండ్ చేశారు. అలాగే, కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కు పెరగాలన్నారు. ఇంతకుముందు, తమ డిమాండ్లు నెరవేర్చకుంటే నిరవధిక దీక్ష చేస్తామని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ చెప్పింది.