తండ్రి లైంగికదాడి:షీనాకి ఇంద్రాణీ తల్లి, అక్క,మరో షాక్
ముంబై: షీనా బోరా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. షీనా తనకు కూతురు మాత్రమే కాదని, సోదరి కూడా అవుతుందని ఇంద్రాణి పోలీసులకు చెప్పింది. తన సవతి తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడటంతో తాను గర్భవతినయ్యానని చెప్పింది.
చిన్నతనంలో తన కన్నతండ్రి ఇల్లు విడిచి వెళ్లిపోయాడని, దీంతో తన తల్లి దుర్గారాణి బోరా తన తండ్రి సోదరుడు ఉపేంద్ర బోరాను పెళ్లి చేసుకుందని చెప్పింది. కాగా, ఈ వివరాలను ప్రముఖ పాత్రికేయుడు వీర్సాంఘ్వి ముందుగానే బహిర్గతం చేశారు.
తన తల్లి తనను రక్షించలేదని ఆమె చెప్పేదని అని, తల్లి కోల్కతా పారిపోయిందని ఇంద్రానీ చెప్పారని తెలిపారు. అయితే ఈ వాదనను ఉపేంద్ర బోరా గురువారం రోజే ఖండించారు. షీనా బోరాకు తాను తాతను మాత్రమేనని, సంరక్షకుడిగా ఉన్నందున స్కూలు రికార్డులో తండ్రి స్థానంలో తన పేరు రాశారని పేర్కొన్నారు.
ఇంద్రానీ రెండో భర్త సంజీవ్ ఖన్నా క్లోజ్ ఫ్రెండ్ షాకింగ్...
షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణీ రెండో భర్త సంజీవ్ ఖన్నాకు మంచి స్నేహితుడు ఒకరు మరో విషయం వెల్లడించారు. పోలీసుల విచారణలో సంజీవ్ ఖన్నా... ఇంద్రాణీ (కీలక సూత్రధారి), డ్రైవర్ శ్యాం రాయ్ హత్యలో పాల్గొన్నట్లుగా చెప్పాడని తెలుస్తోంది.
అయితే, పోలీసులకు విచారణలో హత్య గురించి వెల్లడించిన సంజీవ్ ఖన్నా... చాలా రోజుల క్రితమే అతని స్నేహితుడికి పరోక్షంగా ఈ విషయం వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అతని స్నేహితుడు అజయ్ రావ్లాకు చెప్పాడని తెలుస్తోంది.
ఆంగ్ల మీడియాలో వస్తున్న కథనం ప్రకారం... సంజీవ్ ఖన్నా 2012లో ముంబై వెళ్లాడు. ఇంద్రాణీ నుంచి ఫోన్ కాల్ రావడంతో అతను ముంబై వెళ్లాడు. ఆ తర్వాత అతని పుట్టిన రోజుకు (ఏప్రిల్ 26, 2012) ముందే కోల్కతాకు తిరిగి వచ్చాడు.
ఈ సందర్భంగా ఖన్నా తన మిత్రుడు రావ్లాతో మాట్లాడుతూ... ఇంద్రానీ నన్ను మరోసారి నిండా ముంచిందని చెప్పాడని తెలుస్తోంది. దీని నుంచి తాను బయటపడతానో తనకు తెలియదని చెప్పాడని సమాచారం. అయితే, ప్రత్యేకంగా దేని గురించి సంజీవ్ ఖన్నా మిత్రుడితో చెప్పాడనే విషయం ఆ స్నేహితుడికి తెలియదు. ఆ మిత్రుడు కూడా అతనిని బలవంతం చేయలేదు.