షాకింగ్: భగత్ సింగ్ను ఉగ్రవాదిగా పేర్కొన్న డీయూ
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ను ఉగ్రవాదిగా పేర్కొంది ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన టెక్ట్స్ బుక్స్లో భగత్ సింగ్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ముద్రించింది.
'ఇండియాస్ స్టగుల్ ఫర్ ఇండిపెండెన్స్' అనే పుస్తకంలో ఈ తీవ్రమైన తప్పిదం చోటు చేసుకుంది. దీంతో ఢిల్లీ విశ్వవిద్యాలయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని వర్సిటీ అధికారులను కోరుతున్నారు.
అంతేగాక, చిట్టగాంగ్ ఉద్యమాన్ని కూడా ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. వేలాది మందిని హత్య చేయించిన సాండర్స్ హత్యను కూడా ఉగ్రవాద చర్యగానే అభివర్ణించారు.
Will raise 'DU textbook referring to Shaheed Bhagat Singh as a 'terrorist' issue in Rajya Sabha today:JDU's KC Tyagi pic.twitter.com/U3ukNG8PU5
— ANI (@ANI_news) April 27, 2016
భగత్ సింగ్, చంద్రశేఖర్ అజాద్, సూర్యసేన్ లతోపాటు ఇతర స్వాతంత్ర్య సమరయోధులను విప్లవ ఉగ్రవాదులుగా పేర్కొనడం జరిగింది. కాగా, ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తుతామని పలువురు ప్రజాప్రతినిధులు చెప్పారు.