షాకింగ్: నడి రోడ్డుపై మిట్ట మధ్యాహ్నం బైక్పై వచ్చి...
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. నడి రోడ్డు పైన బాలికను వేధించిన సంఘటన చోటు చేసుకుంది. బాధిత బాలిక వయస్సు పదహారేళ్లు. నగరంలోని జెపి నగర్ పాఠశాల నుంచి తన ఇంటికి ఆ బాలిక వస్తుండగా వేధింపులు జరిగాయి.
ఈ సంఘటన మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జరిగింది. మరో విషయమేమంటే.. ఈ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా చెప్పుకుంటారు. అలాంటి ప్రాంతంలోనే వేధింపులు జరగడం గమనార్హం.
ఆ బాలిక బస్సు దిగి, తన ఇంటికి నడిచి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ద్విచక్ర వాహనం పైన వచ్చిన వారు ఆమెను వేధించినట్లుగా తెలుస్తోంది.
బాధితురాలు చెబుతున్న విషయాల మేరకు... ఇద్దరు యువకులు బైక్ పైన వచ్చి లైంగికంగా వేధించారు. అంతేకాదు, ఆమె స్కూల్ యూనిఫాం లాగే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అరిచింది. వారు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.