ఎవరిదా అస్థిపంజరం?: జయలలిత గెస్ట్ హౌజ్లో కలకలం..
బంగ్లాలో సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తి అవశేషాలుగా వీటిని గుర్తించారు.ఆస్తి వ్యవహారంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
టీనగర్: తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లా వద్ద అస్థిపంజరం బయటపడటం కలకలం రేపుతోంది. ఒకప్పుడు జయలలిత గెస్ట్ హౌజ్ గా ఉన్న ఈ ఇల్లు ప్రస్తుతం శశికళ బంధువులైన మన్నార్ గుడి మాఫియా చేతిలో ఉంది. జయలలిత మరణం తర్వాత ఇక్కడ పోలీసు కాపలా తీసేశారు. ప్రస్తుతం సాయుధ పోలీసులు మాత్రమే ఇక్కడ గస్తీ కాస్తున్నారు.
జయలలిత ఆస్తి ఎంతో తెలుసా, ఈ ఆస్తికి ఎవరికి దక్కునో
సిరుతాపూర్ బంగ్లా వెనుకాల సోమవారం బయటపడిన అస్తిపంజరాన్ని.. బంగ్లాలో సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తిదిగా గుర్తించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నై నగరానికి సుమారు 70-80కి.మీ దూరంలో ఉన్న ఈ బంగ్లాకు జయలలిత అప్పుడప్పుడు విడిది కోసం వచ్చేవారు.
ఆమె మరణానంతరం మన్నార్ గుడి మాఫియా చేతుల్లోకి ఈ బంగ్లా వెళ్లింది. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ కుటుంబ సభ్యులు అందులోనే ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారు. గత ఏప్రిల్ లో ఈ భవనంలో భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. జయలలిత ఆస్తులకు సంబంధించిన పలు విలువైన పత్రాలు ఈ బంగ్లాలో ఉండటంతో.. అగ్ని ప్రమాదంపై అప్పట్లో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.