ఇక వాట్సప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు
రానున్న కొద్ది రోజుల్లోనే మీరు ఎల్పీజీ సిలిండర్ను వాట్సప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: రానున్న కొద్ది రోజుల్లోనే మీరు ఎల్పీజీ సిలిండర్ను వాట్సప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల వాట్సప్ బుకింగ్స్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అక్కడ విజయవంతమైన తర్వాత దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీనిపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది.
దేశంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఈ మేరకు సమాచారం అందించడం జరిగింది. ఎల్పీజీని ఇప్పటికే ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా బుకింగ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు వాట్సప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ మరింత సులభతరం కానుంది.
ఈ విధానం అమలుపై ఇప్పటి వరకు సానుకూల స్పందనలే వచ్చాయి. మొదట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అమలు చేసి, ఆ తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.