జనాలపై దూసుకెళ్లిన ట్యాంకర్: ఇద్దరు విద్యార్థులు మృతి, 6గురికి గాయాలు(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు హెబ్బాళ్ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ ట్యాంకు రోడ్డు దాటుతున్న విద్యార్థులు, జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
అర్పిత(19), ఆనంద్ (25) అనే విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురు విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా ట్యాంకర్ జనాలపైకి దూసుకెళ్లడంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక ట్యాంకర్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందా? అనేది తేలాల్సి ఉంది. ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ యతీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
English summary
Speeding Water Tanker Kills 2 people near Esteem Mall, Hebbal Flyover. Two killed identified as Arpita ( 19), Anand ( 25). Driver Yatish Babu arrested.
Story first published: Thursday, February 26, 2015, 17:54 [IST]