వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్లాస్రుంలోనే విద్యార్థిని పొడిచి చంపాడు: పాత మిత్రుడి పనే
13 ఏల్ల జి. భాస్కర్ అనే విద్యార్థిని పదునైన ఆయుధంతో నుదుటిపై మూడు సార్లు పొడిచాడు. అరుపుకొట్టాయ్ సమీపంలోని పండలుడిలో తోటి విద్యార్థులు చూస్తుండగా నిందితుడు ఆ పనిచేశాడు. గాయపడిన విద్యార్థి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే అతను ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. తరగతులు ప్రారంభం కావడానికి ముందు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దాడి చేసిన విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పాఠశాల మాజీ విద్యార్థిని ఈ ఘటనలో నిందితుడిగా గుర్తించారు. అతను మైనర్ కూడా అని తెలుస్తోంది. దాడి చేసిన అనంతరం అతను పారిపోయాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ట్రాఫిక్ను అడ్డుకున్నారు.
Comments
English summary
A Class VIII student was allegedly stabbed to death by his estranged friend in a class room of a government school in the district on Friday, triggering tension among the students and public.
Story first published: Friday, November 28, 2014, 16:20 [IST]