వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లాస్‌రుంలోనే విద్యార్థిని పొడిచి చంపాడు: పాత మిత్రుడి పనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Student stabbed to death in Tamil Nadu school
చెన్నై: తోటి విద్యార్థులంతా చూస్తుండగా ఓ విద్యార్థి ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడు. మిత్రుడిగా ఉంటూ విడిపోయిన విద్యార్థి తోటి విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. శుక్రవారంనాడు తమిళనాడులోని విరుద్ధునగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

13 ఏల్ల జి. భాస్కర్ అనే విద్యార్థిని పదునైన ఆయుధంతో నుదుటిపై మూడు సార్లు పొడిచాడు. అరుపుకొట్టాయ్ సమీపంలోని పండలుడిలో తోటి విద్యార్థులు చూస్తుండగా నిందితుడు ఆ పనిచేశాడు. గాయపడిన విద్యార్థి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే అతను ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. తరగతులు ప్రారంభం కావడానికి ముందు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దాడి చేసిన విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పాఠశాల మాజీ విద్యార్థిని ఈ ఘటనలో నిందితుడిగా గుర్తించారు. అతను మైనర్ కూడా అని తెలుస్తోంది. దాడి చేసిన అనంతరం అతను పారిపోయాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.

English summary
A Class VIII student was allegedly stabbed to death by his estranged friend in a class room of a government school in the district on Friday, triggering tension among the students and public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X