మహిళలను చితకబాదిన పోలీసులపై వేటు
బెలగావి: వేశ్యవాటి కేంద్రంపై దాడి చెయ్యడానికి వెళ్లిన పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి లాఠీలతో దాడి చేశారని ఆరోపిస్తు ముగ్గురు పోలీసుల మీద వేటు వేశారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తు బెలగావి జిల్లా ఎస్పీ రవి శనివారం ఆదేశాలు జారీ చేశారు.
బెలగావిలో శుక్రవారం వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఒక ప్రాంతంలో సోదాలు చేశారు. ఆ సందర్బంలో కొందరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత పోలీసులు మహిళల మధ్యనడిరోడ్డులో వాగ్వివాదం జరిగింది.
ఆ సందర్బంలో సహనం కొల్పోయిన కానిస్టేబుల్స్ బాబా నాగూర్, ఎం.జి. కురెల్, ఐ.ఎస్, పాటిల్ లాఠీలు తీసుకుని మహిళలను ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. అదే సమయంలో విషయం గుర్తించిన స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్తో వీడియో తీశారు.
ఆ వీడియోను మీడియాకు అందించారు. స్థానికులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రవి విచారణకు ఆదేశించారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని శనివారం జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు. వేశ్యవాటిక కేంద్రాన్ని గుర్తించడానికి ఏఎస్ఐతో పాటు ముగ్గురు పోలీసులు వెళ్లారని చెప్పారు.