వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగ అనే అనుమానంతో కొట్టి చంపేశారు

|
Google Oneindia TeluguNews

గౌహతి: పశువుల దొంగ అనే అనుమానంతో ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపేసిన సంఘటన అసోంలో జరిగింది. డ్రైవర్ ను హత్య చేసిన కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

జుంటి ఆలీ అలియాస్ ఆలీ ( డ్రైవర్) అనే వ్యక్తి సోమవారం వేకువ జామున రెండు గంటల సమయంలో ఒక వాహనంలో ఆరు ఆవులను తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో గోలగడ్ జిల్లా సరిహద్దులోని జాతీయ రహదారి 37 దగ్గర స్థానిక గ్రామస్తులు వాహనాన్ని అడ్డుకున్నారు.

ఆవులు ఎక్కడివని ఆలీని ప్రశ్నించారు. తాను ఆవులను కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నానని ఆలీ చెప్పాడు. అయితే రసీదు చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆలీ రసీదు చూపించకపోవడంతో గ్రామస్తులు సహనం కొల్పోయారు.

Suspected cattle thief killed near Golaghat district in Assam

ఆలీని కిందకు దించి ఇష్టం వచ్చినట్లు చికతబాదారు. ఆవులను కిందకు దించి వాహనానికి నిప్పంటించారు. తీవ్రగాయాలు కావడంతో ఆలీ అక్కడికక్కడే మరణించాడు. ఆలీకి సహకరించిన మిగిలిన పశువుల దొంగలను అరెస్టు చెయ్యాలని జాతీయ రహదారిలో ధర్నా నిర్వహించారు.

ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చించారు. ఆలీని హత్య చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

English summary
A mob killed a man, suspecting him to be a cattle thief, and set ablaze his vehicle in Assam's Golaghat district early Monday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X