విద్యార్థులతో టీచర్ నీచమైన పని (వీడియో)
రాయ్ పూర్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పి నీచమైన పని చేశాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థులను స్టాఫ్ రూంలోకి పిలుచుకు వెళ్లి మసాజ్ చేయించుకున్నాడు.
ఛత్తిస్ గడ్ లోని జశ్ పూర్ జిల్లాలోని తుమ్లా ప్రభుత్వ పాఠశాలలో అనూప్ మింజ్ ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్నాడు. ఇతను మధ్యాహ్నం 10వ తరగతి విద్యార్థులను స్టాఫ్ రూంలోకి పిలుచుకు వెలుతున్నాడు.
తరువాత అక్కడ బొక్కబోర్లా పడుకున్నాడు. ఓ విద్యార్థి తల, నడుము పై భాగంలో మసాజ్ చేశాడు. మరో ఇద్దరు విద్యార్థులు చెరో కాలిని పట్టుకుని నొక్కారు. ఎవరో ఈ టీచర్ నీచమైన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. నేను జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నానని, నేనేమి ఒళ్లు పట్టమని విద్యార్థులకు చెప్పలేదని అనూప్ అంటున్నాడు. విచారణ జరిగిన తరువాత అనూప్ మీద చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు తెలిపారు.