వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 500 కోసం విద్యార్థినులను బట్టలూడదీసి తనిఖీ

|
Google Oneindia TeluguNews

గుర్దాపూర్: తన దగ్గరున్న రూ. 500 నోటు పోయిందని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.. పాఠశాలలోని 15 మంది బాలికలను వివస్త్రలను చేసి తనిఖీ చేసింది. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. మడియాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ అయిన హర్జీత్ కౌర్ తన దగ్గరున్న రూ. 500 నోటు పోయిందనే నెపంతో ఏడో తరగతి బాలికలను బట్టలూడదీసి తనిఖీ చేసింది.

Teacher strips 13 school girls in Gurdaspur

టీచర్ చర్యను అవమానంగా భావించిన బాధిత విద్యార్థినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలికల తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయురాలు హర్జీత్ కౌర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందిత ఉపాధ్యాయురాలు పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
In a shocking incident, 13 girl students of a government school here were allegedly stripped by a school teacher who suspected them of stealing a Rs 500 currency note, police said here on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X