వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: మహిళా టెక్కీని వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపారు

|
Google Oneindia TeluguNews

పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువతిని ఓ దుండగుడు వెంటాడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన అంతారాదాస్‌ (23) ఇక్కడ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. నగర శివారులోని తల్వాడేలో ఉన్న కార్యాలయంలో విధులు ముగించుకుని శుక్రవారం రాత్రిఒంటరిగా తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో వెంబడించాడు.

Techie from Behala chased, stabbed to death in Pune

తనను కాపాడాలంటూ ఆమె కొంతదూరం పరుగు తీసింది. యువతితో వాగ్వాదానికి దిగిన దుండగుడు కత్తితో మెడపైనా, చేతిపైనా తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న సిన్హా అనే వ్యక్తి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు.

అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై స్థానిక దెహు పోలీసులకు సిన్హా ఫిర్యాదు చేశాడు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడ లభించిన బాధితురాలి ఐడీ కార్డు ఆధారంగా వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

English summary
A young software engineer from Kolkata was stabbed to death by a youth on Friday night barely 500 metres from her office in Pune. The assailant chased her with a knife after a heated argument and hit her on the head and neck, a motorcyclist who witnessed the attack told police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X