హోటల్లో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్, అరెస్టు
గుజరాత్: బాలిక మీద కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ లో జరిగింది. కలకలం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కామాంధులను అరెస్టు చేశారు. బాలిక ను వైద్య పరీక్షలకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసు అధికారుల కథనం మేరకు 17 సంవత్సరాల బాలికను ఆమె స్నేహితుడు (20) బయటకు వెళుదామని నమ్మించాడు. తరువాత బాలికను పిలుచుకుని అహ్మదాబాద్ లోని మణినగర్ లోని ఒక ప్రయివేటు హోటల్ లోకి వెళ్లాడు.
కొంత సేపు ఇద్దరు హోటల్ లో కాలం గడిపారు. తరువాత ఆ యువకుడు తన నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి హోటల్ లోకి పిలిపించాడు. ఆ సమయంలో బాలిక ను నిర్బంధించి ఐదుగురు ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుండి పరారైనారు.
తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక తెలిపిన వివరాల ఆదారంగా ఐదు మంది కామాంధులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.