భార్య పుట్టింటిలో, కసితో కన్న కూతురిని రేప్ చేశాడు, కొడుకుకు తెలిసింది, అంతే ఇంటిలో !
కుటుంబ సమస్యల కారణంతో భార్య దూరం అయ్యిందని ఆమె మీద కక్ష పెంచుకున్న భర్త చివరికి కన్న కుమార్తె మీద అత్యాచారం చేశాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న కూతురిపై రెండు సార్లు అత్యాచారం చేశాడు.
అహమ్మదాబాద్: కుటుంబ సమస్యల కారణంతో భార్య దూరం అయ్యిందని ఆమె మీద కక్ష పెంచుకున్న భర్త చివరికి కన్న కుమార్తె మీద అత్యాచారం చేశాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న కూతురిపై రెండు సార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలు సోదరుడికి విషయం చెప్పింది.
కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !
అంతే సొంత కుమార్తె మీద అత్యాచారం చేసిన కసాయి తండ్రిని అతని కుమారుడు అతి దారుణంగా హత్య చేశాడు. గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలో జోదియా ప్రాంతంలో తండ్రిని కుమారుడు హత్య చేశాడని జోదియా పోలీస్ స్టేషన్ అధికారి కోరింగ చెప్పారు.
10, 15 రోజులకు ఒక సారి !
రాజ్ బాబా అనే 47 ఏళ్ల వ్యక్తికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అతను రాజ్ కోట్ లో దినకూలిగా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి వెలితే 10 రోజులకో లేదా 15 రోజులకో ఒక్క సారి మళ్లీ ఇంటికి వస్తాడు. ఇతను తన 19 ఏళ్ల కుమార్తెకు వివాహం చేశాడు.
భార్య వెళ్లిపోయింది
కుటుంబ సమస్య కారణంగా భార్య, కుమారుడిని పిలుచుకుని వెళ్లి ద్వారకా జిల్లాలోని దేవభూమిలో నివాసం ఉంటోంది. ఆదివారం పీకలదాక మద్యం సేవించిన రాజ్ బాబా ఇంటికి వెళ్లి కుమార్తె మీద అత్యాచారం చేశాడు. మీ అమ్మ వెళ్లిపోవడానికి నువ్వ కారణం అంటూ మళ్లీ అత్యాచారం చేశాడు.
సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది
బాధితురాలు దేవభూమిలో తల్లితో పాటు కలిసి ఉంటున్న సోదరుడికి ఫోన్ చేసి తనను నాన్న రెండు సార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. వెంటనే ఆమె సోదరుడు జోదియా ప్రాంతానికి వెళ్లాడు. ఏందుకు తన సోదరిని అత్యాచారం చేశావు అని తండ్రిని ప్రశ్నించాడు.
రేప్ చేస్తే కొంపలు మునిగిపోయాయా ?
మద్యం మత్తులో అత్యాచారం చేశానని, ఎందుకు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కోడుకు మీద తండ్రి తిరగబడ్డాడు. తరువాత నువ్వు ఎందుకు ఫోన్ చేసి నీ సోదరుడిని పిలిపించావు అంటూ కుమార్తె మీద విరుచుకు పడటంతో గొడవ పెద్దది అయ్యింది.
కత్తితో పోడిచి తండ్రిని చంపేశాడు
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన కుమారుడు ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని తండ్రి రాజ్ బాబాను పదేపదే పొడిచి హత్య చేశాడని పోలీసు అధికారి కోరింగ వివరించారు. తన సోదరి మీద అత్యాచారం చేసినందుకు తండ్రి రాజ్ బాబాను హత్య చేశాడని యువకుడు (మైనర్) అంగీకరించాడని పోలీసు అధికారి కోరింగ చెప్పారు.