సెల్ఫీ సరదాకి ఇద్దరు స్నేహితులు బలి
నాసిక్: నేటి యువత సెల్ఫీలు దిగేందుకు చూపుతున్న ఉత్సాహం.. ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చూపడం లేదు. దీంతో వారు తమ ప్రాణాలే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని నాసిక్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్లో వాల్దేవి డ్యామ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం విహార యాత్రకని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వాల్దేవి డ్యామ్కు వెళ్లారు.
సౌరభ్ జగన్నాథ్ చౌల్బార్(18) అనే విద్యార్థి డ్యామ్ వద్ద రాయిపై నిలబడి సెల్ఫీ తీసుకోబోయాడు. ఆ సమయంలో రాయిపై పాదం పట్టు తప్పడంతో నీటిలో పడి కొట్టుకుపోయాడు.
వెంటనే స్నేహితుడిని కాపాడదామని దిగిన మరో విద్యార్థి అజ్యింకా భావ్సాహెబ్ గైకర్(18) కూడా నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని జాలర్ల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.