అపోలో గేటు దగ్గర జయలలిత మేన కోడలు తిష్ట !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదటపడిందని, అమ్మ రోపో మాపో ఇంటికి వచ్చేస్తారని ఆదివారం అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నియన్ చెప్పినకొన్ని గంటలకే జయకు గుండెపోటు రావడంతో తమిళనాడు పరిస్థితి తల్లకిందులైయ్యింది.
జయలలిత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ఆమె ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఇంటికి పంపిస్తామని ఇటీవల అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్పారు.అయితే ఆదివారంసాయంత్రం అందుకు విరుద్దంగా ప్రకటన వెలువడటంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్నజయలలిత సోదరుడు జయకుమార్ కుమార్తె, జయ మేన కోడలు దీపా ఆదివారం రాత్రి అపోలో ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. మా అత్తనుచూడటానికి లోపలికి పంపించాలని అక్కడ ఉన్న పోలీసు అధికారులు, అన్నాడీఎంకే నాయకులకు దీపా మనవి చేశారు.
అయితే దీపాను ఆసుపత్రిలోకి అనుమంతించడానికి అన్నాడీఎంకే నాయకులు నిరాకరించారు. గత నెలలో అపోలో ఆసుపత్రి దగ్గరకు వచ్చిన దీపా మా అత్తను చూడటానికిఅవకాశం ఇవ్వాలని పదేపదే వేడుకున్నా ఆమెను లోపలికి పంపించలేదు.
జయలలితకు నిజమైన వారసురాలు నేనే అంటూ దీపా కొన్ని గంటల పాటు అపోలో ఆసుపత్రి దగ్గర హంగామా చేసి చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడుదీపా ఆసుపత్రిలోకి వెళ్లడానికి అనుమతి ఇస్తారా ? లేదా ? అనే విషయం కచ్చితంగా తెలియడం లేదు.