వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ, శశి అక్రమాస్తుల కేసు విచారణ ఖర్చు ఎంతంటే..?

ఆదాయానికి మించి ఆస్తులు కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ల విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.2.36 కోట్లు ఖర్చు చేసింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ల విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.2.36 కోట్లు ఖర్చు చేసింది. తమిళనాడునుంచి ఈ కేసు కర్ణాటకకు 2004లో బదిలీ అయ్యింది.

2004 నుంచి 2014 వరకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, ఇతరాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.3.93 కోట్లను విడుదల చేయగా రూ.2.36 కోట్లు ఖర్చయ్యాయని సహ కార్యకర్త ఒకరి అర్జీతో గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

The cost of Jayalalithaa case

ఖర్చులకు విడుదల చేసిన మొత్తంలో మిగులు నిధులను న్యాయ, హోంశాఖలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేశాయి. ప్రత్యేక న్యాయస్థానం వద్ద పోలీసు భద్రత, జయలలిత, ఇతర నిందితులు వచ్చి వెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, అధికారులు, సిబ్బంది వేతనాలు, ఇతర భత్యాల రూపంలో రూ.90.13 లక్షలను చెల్లించారు.

కాగా, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తోపాటు ఇళవరసి, సుధాకరణ్‌లను కర్ణాటకలోని పరప్పన జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

English summary
The cost of Jayalalithaa case is that Rs. 2.36 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X