పీజీలో మహిళా టెక్కిని రేప్ చేశారు
బెంగళూరు: చోరీ చెయ్యడానికి వెళ్లిన దొంగ విలువైన వస్తువులు చిక్కకపోవడంతో గదిలో నిద్రిస్తున్న యువతి మీద అత్యాచారం చేసి పరారైన సంఘటన సిలికాన్ సిటి బెంగళూరులో జరిగింది. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
పరప్పన అగ్రహారలోని వెంకట రెడ్డి లేఔట్ లో మహిళా పీజీ కేంద్రం ఉంది. బెంగళూరులోని ప్రసిద్ధి చెందిన ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి అదే పీజీలో ఉంటున్నది. ఈ నెల 26వ తేదిన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నది.
అదే సమయంలో పీజీలో చోరీలు చెయ్యడానికి ఓ దొంగ వెళ్లాడు. అక్కడ ల్యాప్ టాప్ లు, మొబైల్స్ చిక్కకపోవడంతో యువతి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. చప్పుడు కావడంతో యువతి నిద్రలేచింది. యువతి మీద అత్యాచారం చేసిన దొంగ అక్కడి నుంచి పరారైనాడు.
బాధితురాలు ఆలస్యంగా ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. పీజీలో సెక్యూరిటీ గార్డును నియమించలేదని, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.