కూలీ అకౌంట్లో రూ.10వేల కోట్లు పడ్డాయి! ఎలా వచ్చాయి?
మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అంబరం అనే దినసరి కూలి అకౌంటులో ఒక్కసారిగా రూ.9,9000 కోట్లు పడ్డాయట. అయితే, అవి అనుకోకుండా అతని అకౌంటులో పడ్డాయి.
భోపాల్: మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అంబరం అనే దినసరి కూలి అకౌంటులో ఒక్కసారిగా రూ.9,9000 కోట్లు పడ్డాయట. అయితే, అవి అనుకోకుండా అతని అకౌంటులో పడ్డాయి. అంబరం కూలీ పనులు చేసుకుంటూ బ్యాంకులో డబ్బులు దాచుకుంటాడు. అతని బ్యాంకు అకౌంటులో రూ.1500 జమ అయ్యాయి.
వాటిలో నుంచి రూ.500 విత్ డ్రా చేసి తన కూతురు కాలేజీ ఫీజులు కట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ రూ.500 విత్ డ్రా చేశాడు. అదే సమయంలో తన అకౌంటులో రూ.9,900 కోట్లు ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు.
వెంటనే ఈ విషయాన్ని అతను బ్యాంకు అధికారులకు తెలిపాడు. విషయం తెలిసిన బ్యాంకు సిబ్బంది అతని అకౌంటును సీజ్ చేశారు. అయితే, అంత మొత్తం అతని అకౌంటులోకి ఎలా వచ్చిందో అధికారులు విచారణ జరుపుతున్నారు. నగదు మార్పిడి, డిపాజిట్, విత్ డ్రాలు జరుగుతున్నందున అతని అకౌంటులో ఎవరైనా జమ చేశారా అన్న కోణంలోను విచారిస్తున్నారు. లేదా సాంకేతిక లోపం కారణంగా అకౌంటులో జమ అయిందా తెలుసుకుంటున్నారు.